AP: YS జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఆంక్షలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలికారన్నారు. అయితే, కొద్ది పత్రికలు వాస్తవాలను వక్రీకరించి తప్పుదోవ పట్టించేలా తప్పుడు కథనాలు ప్రచురించడం బాధాకరమని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
వార్తలు
జగన్ పర్యటనను విజయవంతం: బొత్స


