హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలో భారత్ పర్యటనకు జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌కు భారత్ ఆహ్వానం పంపింది. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రాబోతున్నారు. దీంతో జిన్‌పింగ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.