హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సరఫరాపై కమిషనర్ తనిఖీ

కడప నగర శివారులోని బండిపల్లి, లింగంపల్లి హెడ్ వాటర్ వర్క్స్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీ. భవాని ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా పంపింగ్ వ్యవస్థ, పైప్‌లైన్లు, మోటార్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.