హైదరాబాద్: 28°C
వార్తలు

ఫీజు బకాయిలపై విద్యార్థుల ర్యాలీ

HYD: రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.8 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆర్. కృష్ణయ్య పిలుపుతో వర్కింగ్ ప్రెసిడెంట్ నేల వెంకటేశ్ నేతృత్వంలో విద్యార్థులు బషీర్‌బాగ్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.