ATP: లక్ష్మీనగర్లో నిర్వహించిన 'ఇంటింటికీ కూటమి ప్రభుత్వం' కార్యక్రమంలో MLA దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. నాయకులతో కలిసి రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. తమ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డివిజన్లో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు, రూ.20 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మించినట్లు చెప్పారు.
వార్తలు
రూ.20 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం


