హైదరాబాద్: 28°C
వార్తలు

E20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గుతుంది.. కానీ: గడ్కరీ

20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్ వాడకంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. E20 పెట్రోల్‌ వాడకం వల్ల మైలేజీ 2 నుంచి 6 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. అయితే వాహన రకం, అది ఏ సంవత్సరంలో తయారైంది? అనే దానిపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.  E10 ఇంధనంతో పోలిస్తే  E20 పెట్రోల్‌ 30 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందన్నారు.