హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: MP

VZM: భోగాపురం మండలం పోలిపల్లిలో గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో MP కలిశెట్టి అప్పలనాయుడు పాల్గోన్నారు. ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలు ఎంతో సంతృప్తి, వ్యక్తం చేస్తూ తమ విశ్వాసాన్ని తెలియజేసారని ఎంపీ తెలిపారు.