BHPL: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని గోరికొత్తపల్లి SI సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి సూచించారు. వాగులు, వంకలు దాటవద్దని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండాలని, చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీరే తాగాలని ఆయన సూచించారు.
వార్తలు
అత్యవసరమైతేనే బయటికి రావాలి :SI


