హైదరాబాద్: 28°C
వార్తలు

సాయికృష్ణ లాక‌ప్‌డెత్ కేసు.. అనూహ్య పరిణామం

AP: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతగల న్యాయవాది ఇలా వ్యవహరించడాన్ని తప్పుబట్టి అడ్వకేట్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని హెచ్చరిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.