లోక్సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై జరిగిన దాడికి అమిత్ షానే బాధ్యత వహించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశానని తెలిపారు. దేశానికి ఉపయోగపడే అంశాలపై మాట్లాడడం తన హక్కు అని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పనని రాహుల్ తేల్చిచెప్పారు.
వార్తలు
సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు: రాహుల్ గాంధీ


