హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల పరిహారం

అస్సాంలోని వరదల్లో మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం హిమంత బిస్వాశర్మ మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల పరిహారం ప్రకటించారు. సాధారణ ఎక్స్‌గ్రేషియా రూ.4 లక్షలు, దీనికి అదనంగా CMRF నుంచి మరో రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.9 లక్షలు అందించనున్నారు. అలాగే, 30 రోజులకు పైగా ఆచూకీ లేని వారి కుటుంబాలకు కూడా రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.