హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీపై గౌరవ్ గొగోయ్ ఫైర్

'యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు'పై లోక్‌సభలో కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. ప్రధానిపై విమర్శలు చేశారు. '21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రధాని స్పందించలేదు. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ వేశామని ప్రధాని ఇన్‌స్టాలో చెప్పారు. 2024 నీట్ లీకేజీ నిందితుల్లో 44 మందికి బెయిల్ ఇచ్చారు. నిందితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది' అని తెలిపారు.