హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ కూడా రేపటికి వాయిదా

వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ప్రసంగిస్తుండగా విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో సభను ఛైర్మన్‌ రేపటికి వాయిదా వేశారు. కాగా, ఇప్పటికే లోక్‌సభ కూడా రేపటికి వాయిదా పడింది.