హైదరాబాద్: 28°C
వార్తలు

డబుల్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి శివాలయం నుంచి ముప్పిరితోట, ధూళికట్ట వరకు రూ.12 కోట్ల నిధులతో చేపడుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఆయన పనుల వివరాలను సంబంధిత నాయకులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.