హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రతా దళాలు అలర్ట్.. కూంబింగ్ తీవ్రతరం

మహారాష్ట్రలో మావోయిస్టుల పోస్టర్ల లభ్యంపై గడ్చిరోలి పోలీసులు స్పందించారు. C-60 కమాండో దళాలు తక్షణమే రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఏటపల్లి, అహేరి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్ చర్యలు చేపట్టాయి. బంద్‌కు సంబంధించి ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.