హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: బుక్కరాయసముద్రం మండలం కేకే అగ్రహారం ZPHS పాఠశాలను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించి స్వయంగా తిన్నారు. ఈ పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు కాకపోవటాన్ని ప్రశ్నించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.