GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో పసుపు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.15,500 లభించింది. ఈ వేలంలో పసుపు కొమ్ముల రకం రూ.13,400 నుంచి రూ.15,500 వరకు పలకగా, కాయ రకం పసుపు ధరలు రూ.13,150 నుంచి రూ.15,150 వరకు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.గత ఐదు రోజులుగా మార్కెట్లో పసుపు ధరలు స్థిరంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వార్తలు
దుగ్గిరాల మార్కెట్లో పసుపు గరిష్ఠ ధర రూ.15,500


