హైదరాబాద్: 28°C
వార్తలు

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

నంద్యాలలో రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం, ఓవర్లోడింగ్‌కు దూరంగా ఉండాలని సీఐ సుబ్రహ్మణ్యం సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండటంతో పాటు, ఆటోలను సురక్షిత స్థితిలో ఉంచాలని తెలిపారు.