హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త తలనొప్పి.. భారీగా పెరిగిన ధరలు

VKB: ఖరీఫ్ సాగు ఊపందుకున్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం రైతులకు కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే విత్తనాలు, దుక్కి, కూలీల వేతనాలు, వ్యవసాయ యంత్రాలు, ఇంధన ధరల పెరగుదలతో సాగు వ్యయం భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఎరువుల ధరలు కూడా అధికంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో వ్యవసాయం కష్టంగా మారింది అంటున్నారు.