హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి

విశాఖ టర్నర్ సత్రంలో జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు. రామతీర్థం దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించగా, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.