హైదరాబాద్: 28°C
వార్తలు

పారా స్పోర్ట్స్‌లో రోహిత్‌కు కాంస్య పతకం

కృష్ణా: అగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి CWSN పారా స్పోర్ట్స్ మీట్‌లో పెడన మండలం దిరిశవల్లి గ్రామానికి చెందిన మూరాల రోహిత్ ప్రతిభ చాటాడు. శ్రీ విజయానంద కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రోహిత్ షాట్‌పుట్ సబ్‌జూనియర్ బాలుర విభాగంలో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం అందుకున్నాడు.