KDP: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు కొర్ర, మినుము, పెసర వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏవో శ్యాంబాబు సూచించారు. మంగళవారం వీఎన్ పల్లె మండలం కొమ్మద్ది గ్రామంలో నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడాలని రైతులకు సూచించారు.
వార్తలు
రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి: AO


