హైదరాబాద్: 28°C
వార్తలు

బంగారం, లక్ష నగదు దోచుకెళ్లిన దుండగులు

ATP: రాయదుర్గం పట్టణంలో గత అర్ధరాత్రి దుండగులు హల్చల్ చేశారు. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని ఉర్దూ పాఠశాల వెనకాల నివసిస్తున్న రహంతుల్లా నివాసంలో గుర్తు తెలియని దుండగులు ఐదు తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. గత రాత్రి తాళం వేసుకొని బంధువుల నివాసానికి వెళ్ళగా ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగిలిపోయిన విషయాన్ని గుర్తించారు.