హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్నాథ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి

PPM: పాలకొండ శ్రీ జగన్నాథ స్వామిని విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి ఉంగట్ల సత్యరావు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు.