హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న తోపుడు బండ్ల తొలగింపు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న రహదారులపై అడ్డంగా నిలిపిన తోపుడు బండ్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. డీఎస్పీ, వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్‌ఐ, సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రోడ్లను ఆక్రమించవద్దని నిర్వాహకులకు పోలీసులు హెచ్చరించారు.