గుంటూరులో మహిళను వివస్త్రను చేసి అవమానించిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఘటనకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ విజ్ఞప్తి చేశారు. వీడియోలు మరింత వ్యాప్తి చెందకుండా సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు సహకరించాలని కోరారు. ఘటనలో తప్పు చేసినవారు ఏ పార్టీకి చెందిన వారైనా చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.
వార్తలు
వీడియోలు తొలగించాలని మహిళా కమిషన్ విజ్ఞప్తి


