SRCL: గ్రామీణ ప్రజలకు సురక్షిత రవాణా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం బోయినిపల్లి మండలం అనంతపల్లిలో ఆర్టీసీ బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం స్వయంగా బస్సు నడిపారు. మహిళలతో కలిసి ప్రయాణించి వారి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన సౌకర్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
వార్తలు
అనంతపల్లిలో ఆర్టీసీ బస్సు ప్రారంభం


