హైదరాబాద్: 28°C
వార్తలు

వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర

ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు అత్యంత వైభవంగా సాగింది. 'జై జగన్నాథ్‌' భక్తి నినాదాల మధ్య దేశవిదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను లాగారు. శ్రీక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ రథాల యాత్ర భక్తుల కోలాహలం మధ్య గుండిచా మందిరానికి చేరుకుంది.