హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతిని కలిసిన IFS ప్రొబేషనర్లు

రాష్ట్రపతి భవన్‌లో భారత అటవీ సర్వీస్ 'IFS' ప్రొబేషనర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం చట్టాల అమలుతోనే అడవుల పరిరక్షణ సాధ్యం కాదన్నారు. అటవీ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేస్తూ ముందుకు సాగాలని యువ అధికారులకు రాష్ట్రపతి కీలక సూచనలు చేశారు.