BHPL: గోరికొత్తపల్లి మండలంలోని చెరువులు, కుంటల్లో అక్రమ మొరం తవ్వకాలపై వచ్చిన సమాచారంతో సాగునీటి శాఖ ఏఈ మహేందర్ ఇవాళ రసూల్కుంట, రామయ్యకుంటలను పరిశీలించారు. చెరువుల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, జేసీబీ యజమానులను ఫోన్లో హెచ్చరించారు. ఇకపై అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
VIDEO: అక్రమ మొరం తవ్వకాలపై అధికారుల హెచ్చరిక..!


