హైదరాబాద్: 28°C
వార్తలు

జనగామలో 67.55% ఎస్‌ఐఆర్ ఫారాల ధ్రువీకరణ పూర్తి‌‌

JN: జనగామ నియోజకవర్గంలో 67.55% ఎస్‌ఐఆర్ ఫారాల ధ్రువీకరణ పూర్తయింది. 278 మంది బీఎల్‌వోలు పనిచేస్తుండగా, 2,49,437 మంది ఓటర్లకు సంబంధించిన ఎస్‌ఐఆర్ ఫారాల డౌన్‌లోడ్, ముద్రణ, పంపిణీ 100 శాతం పూర్తైంది. ఇప్పటివరకు 1,69,281 ఫారాలు (67.87%) డిజిటలైజేషన్ చేయగా, 1,68,494 ఫారాలను (67.55%) బీఎల్‌వోలు ధ్రువీకరించినట్లు అధికారులు వెల్లడించారు.