హైదరాబాద్: 28°C
వార్తలు

కరోనా కేసులు.. సీఎం కీలక ఆదేశాలు

AP: మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కేసు నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. కరోనా కిట్లు రెడీగా ఉన్నాయని.. డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలని సీఎం సూచించారు.