KNR: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. హెచ్ఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్లో 25 ఖాళీల భర్తీ కోసం ఈ మేళా ఏర్పాటు చేశారు. 10వ తరగతి, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ అర్హత కలిగిన 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాఫీలతో హాజరుకావాలి అన్నారు.
వార్తలు
ఈనెల 21న జిల్లాలో జాబ్ మేళా


