SKLM: ఆమదాలవలస వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో అకాల మరణం చెందిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.
వార్తలు
'ముద్రగడ సేవలు చిరస్మరణీయం'


