హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉద్యోగ కల్పనకు కొత్త అవకాశాలు'

భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 'CETA' అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే ఈ ఒప్పందం ద్వారా దాదాపు 99 శాతం భారతీయ ఎగుమతులకు యూకే మార్కెట్‌లో సుంకరహిత ప్రవేశం లభిస్తుంది. ఇది వస్త్రాలు, ఔషధాలు, వ్యవసాయ రంగాలకు ఊతమివ్వడమే కాకుండా, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు.