హైదరాబాద్: 28°C
వార్తలు

29 మందికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి

ఉమ్మడి కర్నూలు జిల్లా రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 29 మంది సీనియర్ అసిస్టెంట్లు, రీసర్వే డీటీలకు రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తూ మంగళవారం కలెక్టర్ డా.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నంద్యాల జిల్లాకు చెందిన 15 మంది ఉన్నారు. కాగా కర్నూలు జిల్లాలో పదోన్నతి పొందిన 14 మందికి పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.