హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్నాథ స్వామి రథయాత్రపై సమీక్ష

అనకాపల్లిలో ఈనెల 16 నుంచి 25 వరకు జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మంగళవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల రద్దీ నియంత్రణ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.