రాజస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మే నెల నుంచి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రసవం తర్వాత కిడ్నీలు దెబ్బతిని మరో ఏడుగురు చికిత్స పొందున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మరణాలపై సీరియస్ అయిన ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో మాతృత్వ ఆరోగ్య సేవలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
బాలింతల వరుస మరణాలు.. ప్రజలు ఆందోళన


