హైదరాబాద్: 28°C
వార్తలు

హాస్టల్‌ను సందర్శించిన మంత్రులు

ప్రకాశం: టంగుటూరులోని బీసీ హాస్టల్‌ను మంత్రులు సవిత, స్వామి సోమవారం సందర్శించారు. హాస్టల్లో రూములు, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి పారిశుధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను పంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.