హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటర్‌ ఐడీ పొందిన ఇద్దరు పాకిస్థానీయుల అరెస్ట్‌

కర్ణాటకలోని బాగేపల్లిలో జాతీయతను దాచిపెట్టి అక్రమంగా రేషన్ కార్డ్‌, ఓటర్‌ ఐడీ పొందిన పాక్‌కు చెందిన తల్లీ, కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక మహ్మమద్‌ ఆయుబ్‌ ఖాన్‌ పాక్ యువతి ఫరా నాజ్‌ను వివాహం చేసుకోగా, వారి కుమారుడు ఫర్డీన్‌ పాక్‌లో జన్మించాడు. సర్వే ప్రక్రియలో వీరి అక్రమ పత్రాల వ్యవహారం బయటపడింది.