హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రాద్రికి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాక

BDK: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూలై 13న జిల్లాలో పర్యటించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు ఆఫ్‌టేక్ పాయింట్, పంపింగ్ స్టేషన్‌ను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వారు సీతారామ సాగర్ ప్రాజెక్టు, ఆఫ్‌టేక్ పాయింట్‌ను సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.