ELR: జిల్లాలోని స్థానిక రామచంద్రరావు పేట మున్సిపల్ పార్కులో 'శక్తి టీం' అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రత కోసం అందుబాటులో ఉన్న డయల్ 112 మరియు ‘శక్తి యాప్’ పనితీరుపై ప్రజలకు డెమో ద్వారా వివరించారు. ఆపద సమయంలో భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళల రక్షణే ధ్యేయంగా పని చేస్తామన్నారు.
వార్తలు
ఏలూరులో ‘శక్తి టీం’ అవగాహన సదస్సు


