హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

హన్మకొండ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పలు కాలనీలకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ప్రశాంత్ నగర్, సిద్ధార్థ నగర్, వడ్డేపల్లి, టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర నగర్, స్నేహ నగర్, శ్రీనగర్, పరిమళా కాలనీ, పోలీస్ కాలనీ, ఆర్టీసీ కాలనీలలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.