మహారాష్ట్రను కుండపోత వానలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. భివాండి ప్రాంతంలో ఏకంగా మోకాళ్ల లోతు వరకు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ముంబైలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో కుర్ల, తిలక్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు
మహారాష్ట్రను ముంచెత్తిన వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


