NZB: ముప్కాల్ మండల కేంద్రంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎదుట పాత జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్లైన్ మరమ్మతుల కోసం తవ్విన రోడ్డును అధికారులు సరిగా బాగు చేయలేదు. కేవలం మొరంతో పూడ్చి వదిలేయడంతో, వర్షానికి ఆ ప్రాంతం బురదమయంగా మారింది. చిన్నపాటి వానకే నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
వార్తలు
అధికారుల నిర్లక్ష్యం.. వాహనదారుల నరకం!
Advertisement
Advertisement
Advertisement


