హైదరాబాద్: 28°C
వార్తలు

ఎరువుల సరఫరా, తయారీ కేంద్రానిదే: పొన్నం

Advertisement

TG: ఎరువుల సరఫరా సమస్యను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎరువుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. ఎరువుల తయారీ, సరఫరా బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఎరువులను రైతులకు ఇచ్చే బాధ్యత తమదని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని కేంద్రమంత్రులు, ఎంపీలు కృషి చేయాలని కోరారు.

Advertisement

Advertisement