హైదరాబాద్: 28°C
వార్తలు

మొహరం పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

Advertisement

ప్రకాశం: మార్కాపురంలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై వేమన మండల ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేశారు. మొహరం పండుగను కుల, మతాలకు అతీతంగా జరుపుకుంటారని అలానే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని తెలియజేశారు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Advertisement