హైదరాబాద్: 28°C
వార్తలు

'తేజస్వి సూర్య తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం'

Advertisement

TG: తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చి అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాద్‌లో ఆయన హాజరయ్యే 'నమో జెన్ జీ' సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. పేపర్ లీకులతో యువత జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ, ఇలాంటి సదస్సులు పెట్టడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

Advertisement

Advertisement