TG: హనుమకొండలో TRS అధ్యక్షురాలు కవిత ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో చిన్న ప్రైవేట్ కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, స్కూటీలు కూడా ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు.
వార్తలు
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: కవిత


