ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ క్షేత్రం రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయి నిత్య జలాభిషేకం శనివారం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దపు భూకంపం వల్ల గర్భగుడి నీటి మార్గమైన సోమసూత్రం మూసుకుపోగా, ఆధునిక సాంకేతికతతో కట్టడానికి ఎలాంటి హాని కలగకుండా అధికారులు అడ్డంకులను తొలగించారు. దీంతో పూర్వకాలం నాటి సంపూర్ణ జలాభిషేక ప్రక్రియ విజయవంతంగా పునరుద్ధరణ పొందింది.
తెలంగాణ
300 ఏళ్ల తర్వాత జలాభిషేకం


